Breaking News

హసీనాకు మరణశిక్షతో మరోసారి భగ్గుమన్న బంగ్లాదేశ్‌..


Published on: 18 Nov 2025 12:23  IST

పొరుగుదేశం బంగ్లాదేశ్‌ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కు బంగ్లా ప్రత్యేక ట్రిబ్యునల్‌ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో బంగ్లాలో అల్లర్లు చెలరేగాయి. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హసీనా మద్దతుదారులు, అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారి ఆందోళనలతో బంగ్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అవామీలీగ్‌ పార్టీ రెండు రోజులపాటూ దేశవ్యాప్తంగా బంద్‌ ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి