Breaking News

న్యాయ విచారణ జరపాల్సిందే... సీపీఎం డిమాండ్


Published on: 19 Nov 2025 16:22  IST

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో నిన్న, ఈరోజు జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు  డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్ట విరుద్ధమైన బూటకపు ఎన్‌కౌంటర్లను సీపీఎం ఖండిస్తుందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి