Breaking News

మూడు నెలలుగా జీతాలు బంద్‌..


Published on: 20 Nov 2025 17:35  IST

మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఎం డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాగా, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) స్కీమ్‌లో 78 క్యాడర్‌లలో పనిచేస్తున్న 17,541 మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి