Breaking News

మీన రాసి..ఉమ్మడి జిల్లాలో పెరిగిన మత్స్య సంపద


Published on: 21 Nov 2025 10:56  IST

నీటి వనరులు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందుతోంది. తద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది. దీంతో జిల్లా చేపలను పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తద్వారా ఏడాదికి రూ.80కోట్లపైగా ఆదాయం గడిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా అనంతపురం, ఎంపీ డ్యాం, పీఏబీఆర్‌, బీటీపీ మత్స్యక్షేత్రాల్లో చేపపిల్లల పెంపకం చేపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి