Breaking News

మోగిన నగారా


Published on: 26 Nov 2025 12:38  IST

తెలంగాణలో నవంబరు 27 ప్రారంభమయ్యే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ.. డిసెంబర్‌ 17 నాటికి పూర్తికానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికలసంఘం కమిషనర్‌ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేశారు.ఎస్‌ఈసీ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ సృజన, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్‌ స్థానాలకు, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి