Breaking News

శ్రీకాంతాచారి పేరు ఒక్క పథకానికైనా పెట్టారా...


Published on: 04 Dec 2025 12:06  IST

ఒక్క ప్రాజెక్టుకైనా అమరుడైన శ్రీకాంతాచారి పేరు పెట్టారా? అని కాంగ్రెస్‌ నేతలను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిలదీశారు. అమరులను గౌరవిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ .. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ పేర్లనే ప్రాజెక్టులకు పెట్టిందన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా బుధవారం ఎల్బీనగర్‌లోని మహనీయుల విగ్రహాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి