Breaking News

ఓరీ దేవుడో ఇదేం వైద్యం..!


Published on: 05 Dec 2025 16:11  IST

గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో . వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్ర ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన మహిళ శరీరంలో సర్జికల్‌ బ్లేడ్‌ను వదిలేసిన ఘటన కలకలం రేపింది. నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి (22) కుటుంబ నియంత్ర ఆపరేషన్‌ కోసం ఆస్పత్రిలో చేరింది. రమాదేవికి శరీరంలో సర్జికల్‌ బ్లేడ్‌ను వదిలేసి  ఆపరేషన్‌ చేశారు డాక్టర్ నారాయణ స్వామి, ఆయన సిబ్బంది.

Follow us on , &

ఇవీ చదవండి