Breaking News

సీఎం రేవంత్ వరుస సమావేశాలు


Published on: 09 Dec 2025 14:27  IST

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఎంవోయూలు కుదర్చుకుంటున్నాయి. సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్.. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదర్చుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి