Breaking News

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పరిధిలోని కనకమామిడిలోని తాజ్ డ్రైవ్-ఇన్ సమీపంలో ఈరోజు (నవంబర్ 21, 2025) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 


Published on: 21 Nov 2025 10:54  IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పరిధిలోని కనకమామిడిలోని తాజ్ డ్రైవ్-ఇన్ సమీపంలో ఈరోజు (నవంబర్ 21, 2025) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్-ఇన్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి