Breaking News

పోఖారా నుండి ఖాట్మండుకు వెళ్తున్న ప్రయాణీకుల బస్సు నియంత్రణ కోల్పోయి పృథ్వీ హైవేపై ఉన్న త్రిశూలి నదిలో పడిపోయింది.

నేపాల్‌లోని ధాడింగ్ జిల్లాలో సోమవారం (2026, ఫిబ్రవరి 23) తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. 


Published on: 23 Feb 2026 11:10  IST

నేపాల్‌లోని ధాడింగ్ జిల్లాలో సోమవారం (2026, ఫిబ్రవరి 23) తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. 

పోఖారా నుండి ఖాట్మండుకు వెళ్తున్న ప్రయాణీకుల బస్సు నియంత్రణ కోల్పోయి పృథ్వీ హైవేపై ఉన్న త్రిశూలి నదిలో పడిపోయింది.ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 1:15 - 1:30 గంటల మధ్య బెనిఘాట్ రోరాంగ్ గ్రామీణ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.ఇప్పటివరకు 18 మంది మరణించగా, సుమారు 25 నుండి 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మంది పురుషులు, 6 గురు మహిళలు ఉన్నారని సమాచారం.నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు (APF), మరియు స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖాట్మండులోని ఆసుపత్రులకు తరలించారు

Follow us on , &

ఇవీ చదవండి