Breaking News

ఎస్‌బీఐ బ్యాంక్‌కు తాళం వేసిన ఖాతాదారులు


Published on: 04 Apr 2025 15:56  IST

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)కు కొందరు ఖాతాదారులు తాళం వేసి, బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. బ్యాంక్‌లో గత సంవత్సరం నవంబర్ 19న దుండగులు చోరీకి పాల్పడి 497 మందికి చెందిన సుమారు 16 కిలోలకు పైగా బంగారాన్ని చోరీ చేశారు. తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా.. బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. 

Follow us on , &

ఇవీ చదవండి