Breaking News

బంగాళాఖాతంలో అల్పపీడనమట:వానలు దంచుడే


Published on: 26 Jun 2025 15:33  IST

ఏపీకి రెయిన్స్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వెదర్ అప్ డేట్ వచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారిణి తార స్వరూప తెలిపారు. ప్రస్తుతం ఇది 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. త్వరలో అల్ప పీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి