Breaking News

సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ


Published on: 26 Jun 2025 18:09  IST

ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో.. భాజపా పరువుకు భంగం కలిగేలా రేవంత్‌రెడ్డి మాట్లాడారని వాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్‌ డిఫమేషన్ కేసు నమోదైంది.కింది కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. జస్టిస్‌ కె.లక్ష్మణ్ ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి