Breaking News

సరిహద్దు చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు..!


Published on: 26 Jun 2025 16:24  IST

తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాలోని ఆర్టీవో కార్యాలయాలు, సరిహద్దుల్లోని చెక్‌పోస్టులపై ఏక కాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి, కామారెడ్డి పెద్దపల్లి జిల్లాల్లోని రోడ్డు రవాణాశాఖ కార్యాలయాలను కలుపుకుని ఏకంగా 18 ఆఫీసులపై మూకుమ్మడిగా అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు తొత్తులుగా మారిన ఆర్టీవో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి