Breaking News

టూ వీలర్లపై టోల్‌ ఛార్జీలు.. ?


Published on: 26 Jun 2025 16:30  IST

జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల నుంచి టోల్‌ ఫీజు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోందంటూ ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై కేంద్రం తాజాగా స్పందించింది. టూవీలర్స్‌కు టోల్‌ వసూలు వార్తలను ఖండించింది. ఈ మేరకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) స్పష్టతనిచ్చింది. అవన్నీ ఫేక్‌ వార్తలని స్పష్టం చేసింది. టోల్‌ వసూలు ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి