Breaking News

ఇరాన్‌ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్‌ నిఘా..?


Published on: 26 Jun 2025 17:10  IST

ఇరాన్‌ అణుకేంద్రాలపై తాము దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌కు చెందిన ఏజెంట్లు అక్కడికి వెళ్లి పరిశీలించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. అగ్ర రాజ్య దాడుల్లో ఇరాన్‌కు ఊహించినంత నష్టం జరగలేదంటూ.. పెంటగాన్‌ను ఉటంకిస్తూ కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. ట్రంప్ నాటో సదస్సులో మాట్లాడుతూ ‘‘మీకు తెలుసా వాళ్ల (ఇజ్రాయెల్‌) మనుషులు అక్కడికి వెళ్లి పరిశీలించి పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి