Breaking News

ఆపరేషన్‌ చక్ర-V: సైబర్‌ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం..


Published on: 26 Jun 2025 17:55  IST

సైబర్‌ నేరాలపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) కొరడా ఝుళిపించింది. దేశ వ్యాప్తంగా 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. ఆపరేషన్ చక్ర-V పేరుతో ఈ దాడులు చేపట్టింది. మొత్తం 5 రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్‌ చేసింది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి ఈ ఆపరేషన్‌ను సీబీఐ చేపట్టింది. ఈ దాడుల్లో మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్‌ ఓపెనింగ్‌ ఫారాలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి