Breaking News

తెలంగాణలో బోనాల సందడి షురూ..


Published on: 27 Jun 2025 08:39  IST

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. తొట్టెలు, తొలి బోనంగా పిలిచే నజర్ బోనాలకు పూజలు చేసి ఊరేగింపు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి