Breaking News

గణేష్‌ నిమజ్జనానికి కృత్రిమ కొలనులు


Published on: 03 Jul 2025 16:27  IST

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. 10 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 1.32 మీటర్ల లోతుతో ఉండే పీవీసీ పోర్టబుల్‌ పాండ్‌లు అవసరమని టెండర్‌లో పేర్కొంది. 2.36 లక్షల లీటర్ల నీరు పట్టే సామర్థ్యంతో కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయనున్నారు.మొదటి విడతగా సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో 50 కొలనుల ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానించారు.

Follow us on , &

ఇవీ చదవండి