Breaking News

సింగరేణి వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి..


Published on: 03 Jul 2025 19:17  IST

ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ పరిధిలోని సింగరేణికాలనీ వివాదస్పద స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న గుడిసెవాసులందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కోట్ల శ్రీనివాస్‌ గురువారం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరి చందనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సైదాబాద్‌ మండల పరిధిలోని ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ పరిధిలోని సింగరేణికాలనీ 25 ఎకరాల స్థలంలో గుడిసెల్లో ఉండే వారందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి