Breaking News

ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగింపు


Published on: 15 Jul 2025 18:38  IST

హయత్ నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.159 లో అక్రమంగా వెలిసిన కంటైనర్ నిర్మాణాలను తొలగించినట్లు హయత్ నగర్ తహసిల్దార్ కే. జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తహాసీల్దార్ జానకి ఆదేశాల మేరకు డిప్యూటీ తహసిల్దార్ అనిల్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్వాతి, జూనియర్ అసిస్టెంట్ వీరన్నతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను జేసీబీ సహాయంతో తొలగించారు.

Follow us on , &

ఇవీ చదవండి