Breaking News

మైనార్టీ గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం


Published on: 16 Jul 2025 18:24  IST

సైదాబాద్‌ బాలుర-1 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో బుధవారం ముక్తి భారత్‌ అభియాన్‌ స్క్రీనింగ్‌ క్యాంపును ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యపరమైన సమస్యలను తెలుసుకోవడానికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు.పాఠశాలలోని విద్యార్థులందరికీ వైద్య శిబిరాన్ని నిర్వహించి, అవసరమైన విద్యార్థులకు వైద్యులు తగు సూచనలు చేశారని ప్రిన్సిపల్‌ తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి