Breaking News

రోడ్డెక్కిన రైతన్నలు..గద్వాల ఐజ రహదారిపై నిరసన


Published on: 16 Jul 2025 18:26  IST

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని బింగి దొడ్డి గ్రామ స్టేజీ వద్ద సీడ్ పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. సుమారు వెయ్యి మంది రైతులు దాదాపు 5 గంటల పాటు రహదారిపై బైటాయించడంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. నడిగడ్డ కుల పోరాట సమితి అధ్యక్షుడు గోంగొళ్ళ రంజిత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, చిన్న రాముడు, బీజేపీ నాయకులు రామచంద్రా రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి