Breaking News

ప్ర‌భంజ‌న్ యాద‌వ్ మృతిప‌ట్ల కేసీఆర్ సంతాపం


Published on: 16 Jul 2025 18:32  IST

తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మరణం పట్ల.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టు మేధావిగా, యాక్టివిస్ట్‌గా ప్రభంజన్ యాదవ్ చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.ఢిల్లీలో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రభంజన్ యాదవ్ ఉద్యమ నిబద్ధత గొప్పదని కేసీఆర్ అన్నారు.శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి