Breaking News

రాజధాని రైతుల ప్లాట్లలో మౌలిక వసతులు


Published on: 10 Dec 2025 12:42  IST

రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఏడాదిలోగా మౌలిక వసతుల కల్పన పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, రైతుల ప్లాట్ల అభివృద్ధి పనులను అధికారులు, ఇంజనీర్లతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పెండింగ్‌ పనులు, గుంటూరు చానల్‌పై మంగళగరి రోడ్డును సీడ్‌ యాక్సిస్‌ రహదారితో కలిపేలా నిర్మిస్తున్న స్టీల్‌ వంతెన పనులను మంత్రి పరిశీలించారు.ఈ ప్లాట్లలో ఏడాదిలోగా ఇతర పనులు పూర్తవుతాయని వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి