Breaking News

రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం


Published on: 10 Dec 2025 14:54  IST

రాజధాని అమరావతిలోని తుళ్ళూరు మండలంలో మంత్రి నారాయణ ఈరోజు (బుధవారం) పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పోలింగ్‌కు రైతులు అంగీకారం తెలిపారు. అయితే కౌలు ప్యాకేజీ పెంచాలని మంత్రికి రైతులు వినతి చేశారు. గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు తమ పాసుపుస్తకాలను మంత్రి నారాయణకు అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి