Breaking News

గుజరాత్‌లోని కచ్‌లో భూకంపం..


Published on: 26 Dec 2025 18:59  IST

గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభ‌వించింది. ఉద‌యం 4.30 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.23.65° నార్త్ లాటిట్యూడ్, 70.23° ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలిపింది. భూ ప్రకంపనలు రాగానే అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంప ప్రభావిత ప్రాంతంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి