Breaking News

అడ్డంగా బుక్కైన మింత్రా.. రంగంలోకి దిగిన ఈడీ..


Published on: 23 Jul 2025 17:40  IST

గత కొంత కాలంగా బట్టలకు సంబంధించి మింత్రా దూసుకపోతుంది. బట్టలు అనగానే నెటిజన్స్ ఎక్కువగా ఈ యాప్‌నే యూజ్ చేస్తున్నారు. దీంతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో మింత్రాపై ఈడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మింత్రా ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. రూ.1,654.35 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించినందుకు మింత్రాతో పాటు దాని అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి