Breaking News

వ్యవసాయ మార్కెట్‌ను తనిఖీ చేసిన రైతు కమిషన్‌


Published on: 23 Jul 2025 18:12  IST

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ను రైతు కమిషన్‌ బృందం బుధవారం ఉదయం 6గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేసింది. దాదాపు గంటన్నరపాటు మార్కెట్‌లో పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యంపై ఆరా తీసింది. వివిధ రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు వచ్చిన వ్యాపారులతో రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్‌, భవానీరెడ్డి మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి