Breaking News

మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి


Published on: 24 Jul 2025 14:55  IST

గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)పై విమర్శలు గుప్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి