Breaking News

రైలు కింద ప‌డి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య


Published on: 24 Jul 2025 18:43  IST

రైలు కింద ప‌డి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘ‌ట‌న ఘట్‌కేస‌ర్‌లోని యమ్నంపేట రైల్వే వంతెన సమీపంలో గురువారం చోటుచేసుకుంది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు చెందిన కె. రాజేందర్ (23) హైద‌రాబాద్‌ నగరంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. యమ్నంపేటలోని షెడ్యూల్డ్ కులాల‌ అభివృద్ధి విభాగం  హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం వేగంగా వస్తున్న ప్యాసింజర్ రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. 

Follow us on , &

ఇవీ చదవండి