Breaking News

నాయకుల మాటలు విని తప్పు చేస్తే అధికారులు జైలుకు వెళ్తారు


Published on: 15 May 2025 12:54  IST

తెలంగాణ రాజకీయాల్లో నీళ్లు, నిప్పును రాజేస్తున్నాయి. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ మధ్య ప్రాజెక్టు లడాయి మొదలైంది. కొలువుల కేంద్రంగా పొలిటికల్‌ కొట్లాట పీక్స్‌కు చేరుకుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇరిగేషన్‌ను భ్రష్టుపట్టించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే కాంగ్రెస్‌ పాలనలో ఎన్ని నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్‌ చేశారు.హైదరాబాద్‌ జలసౌధలో నిర్వహించిన కొలువు పండుగ వేదికగా బీఆర్‌ఎస్‌పై వాగ్బాణాలను సంధించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి