Breaking News

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత..


Published on: 04 Feb 2026 17:38  IST

దాదాపు ఏడాది తర్వాత మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఫిబ్రవరి 13, 2025 నుండి మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, 60 మంది సభ్యుల శాసనసభను తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ పదవీకాలం 2027లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియమితులైన బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ఎన్డీయే బృందంతో కలిసి రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో సమావేశమయ్యారు. 

Follow us on , &

ఇవీ చదవండి