Breaking News

కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు


Published on: 15 May 2025 19:01  IST

కశ్మీర్ సమస్యపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని, ఇది భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు కేంద్రమంత్రి చెప్పారు. పాకిస్థాన్ సైన్యాన్ని కాకుండా, ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని ముందే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, పాకిస్థాన్ ఈ సలహాను పట్టించుకోలేదన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి