Breaking News

రాష్ట్రానికి మరో గట్టి ఎదురుదెబ్బ..


Published on: 16 May 2025 11:34  IST

రాష్ట్రానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన ఒక్కో సంస్థ ఇక్కడి అమడదూరంగా వెళ్లిపోతున్నాయి. దీంతో చిప్‌ల తయారీ పరిశ్రమ ఇక్కడికి రావడం ఎండమావిగానే కనిపిస్తున్నది. ఇప్పటివరకు దేశంలో ఆరు సెమీకండక్టర్‌ యూనిట్లకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపగా..అందులో మన రాష్ర్టానికి చోటు లేకపోవడం విశేషం. నాలుగు యూనిట్లు గుజరాత్‌లో ఏర్పాటుకానుండగా, ఒకటి అస్సాం, మరొకటి ఉత్తరప్రదేశ్‌కు తరలిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి