Breaking News

పాక్‌ జల ఒప్పందంపై.. ఒమర్‌, ముఫ్తీ మధ్య ట్వీట్స్‌ వార్‌


Published on: 16 May 2025 18:16  IST

జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఒకరికొకరు విమర్శించుకున్నారు. పాకిస్థాన్‌తో జలాల ఒప్పందం గురించి వారిద్దరి మధ్య ట్వీట్ల వార్‌ జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని వులార్ సరస్సు పునరుద్ధరణకు 1987లో తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌ను నాటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే సింధు జలాల ఒప్పదం ఉల్లంఘనగా పేర్కొంటూ పాకిస్థాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో 2007లో ఈ ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయాయి.

Follow us on , &

ఇవీ చదవండి