Breaking News

తిరువూరు ఛైర్మన్‌ ఎన్నికకు మళ్లీ బ్రేక్


Published on: 20 May 2025 15:08  IST

తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడం అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో కే.మాధురి ప్రకటించారు. సమావేశానికి మొత్తం 11 మంది కోరం ఉండాల్సి ఉండగా.. కేవలం ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు. దీంతో ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్డీవో వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి