Breaking News

ఢిల్లీలో రెండురోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన


Published on: 22 May 2025 18:47  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శుక్ర, శనివారాల్లో పలువురు కేంద్రమంత్రులను ఢిల్లీలో కలవనున్నారు. ఇవాళ(మే22) సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు రాత్రి 8గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.రేపు(మే23) రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్ ఐటీ, శాస్త్ర సాంకేతిక, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి