Breaking News

విజయవాడలో పట్టుబడ్డిన విదేశీయులు..


Published on: 23 May 2025 14:49  IST

పెనమలూరు మండలం కానూరు, తాడిగడపలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన 15 మంది యువకులను గుర్తించారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురు యువకులు ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో వారందరినీ స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి