Breaking News

పోలీసుల ఎదుట లొంగిపోయిన 18 మంది మావోయిస్టులు


Published on: 27 May 2025 15:44  IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా లో పోలీసుల ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌లో చురుకుగా ఉన్న నలుగురితో సహా మొత్తం 18 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిలో 10 మందిపై కలిపి మొత్తం రూ.38 లక్షల రివార్డు ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో పెద్దఎత్తున మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో వీరు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి