Breaking News

ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ..


Published on: 09 Jun 2025 18:38  IST

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. బస్ పాస్ ఛార్జీలను 20 శాతం మేర పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలతోపాటు స్టూడెంట్ పాస్ ధరలను సైతం పెంచింది. ప్రస్తుతం ఆర్డినరీ బస్ పాస్ నెలకు రూ.1,150 ఉండగా.. దానిని రూ. 1,400కు పెంచింది. అలాగే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ధర ప్రస్తుతం రూ.1,300 ఉండగా.. ఆ ధరను రూ.1,600కు పెంచింది. ఇక మెట్రో డీలక్స్ పాస్ రూ.1,450 ఉండగా.. ఆ ధరను రూ.1,800కు పెంచింది.

Follow us on , &

ఇవీ చదవండి