Breaking News

‘ఐసీసీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌’లోకి ధోనీ


Published on: 10 Jun 2025 14:07  IST

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలోకి అతడికి చోటు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మొత్తం ఏడుగురికి స్థానం ఇవ్వడం గమనార్హం. ఇందులో ఐదుగురు పురుష క్రికెటర్లు, ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు. భారత్ నుంచి ఎంఎస్ ధోనీ కాగా.. గ్రేమీ స్మిత్, హషీమ్ అమ్లా, మాథ్యూ హేడెన్, డానియల్ వెట్టోరి ఉన్నారు. ఇక మహిళా క్రికెటర్లలో సనా మిర్, సారా టేలర్‌కు అవకాశం దక్కింది.

Follow us on , &

ఇవీ చదవండి