Breaking News

రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి..!


Published on: 10 Jun 2025 18:20  IST

తెలంగాణ రాష్ట్రంలోనూ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ విద్యార్థులు ప్రస్తుత ఏపీలోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లలో విద్యార్థులు ప్రైవేట్‌గా అడ్మిషన్లు పొంది చదువును పూర్తి చేస్తున్నారని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి