Breaking News

కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్


Published on: 17 Jun 2025 10:18  IST

అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. మహిళను మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ తెలియజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి