Breaking News

బీఆర్ఎస్‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్


Published on: 24 Jun 2025 15:21  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలాలను ఇవాళ(మంగళవారం) సిట్ అధికారులు నమోదు చేశారు. 2023 నవంబర్ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 4వేల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు కనుక్కున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో సిట్ ఎదుట ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈటల స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి