Breaking News

మహదేవ్‌పూర్‌లో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు


Published on: 24 Jun 2025 16:57  IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ పార్కులో సీఎస్ఆర్ నిధులతో పిల్లల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ పార్కును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి. పార్కులో ముఖ్యంగా జారుడు బండ, రంగులరట్నం తో పాటు పలు రకాల క్రీడా పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి