Breaking News

మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక


Published on: 27 Jun 2025 11:11  IST

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరించారు. ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా..మాజీ మావోయిస్టు మంత్రి సీతక్క ఆదివాసీల హక్కుల స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మావోయిస్టులు వివరించారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి