Breaking News

ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌..


Published on: 27 Jun 2025 11:34  IST

కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఇంట్లో ఎలక్ట్రిక్‌ స్కూటీకి ఛార్జింగ్‌కు పెట్టగా అకస్మాత్తుగా పేలింది. ఇంటి ప్రాంగణంలో తన కుటుంబం కోసం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటీ రాత్రి ఛార్జింగ్‌ కోసం ఉంచారు స్కూటీ అకస్మాత్తుగా పేలింది. అయితే.. అక్కడే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) మంటలు వ్యాపించటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.వాహనం పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఫోరెన్సిక్‌ టీంను రప్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి