Breaking News

టోల్ వసూళ్ల కేసులో కాకాణీని ప్రశ్నించనున్న పోలీసులు


Published on: 30 Jun 2025 11:44  IST

సెంట్రల్ జైలులో పలు కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ కీలకనేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సోమవారం ముత్తుకూరు పోలీసులు కస్టడీ కి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు వద్ద కంటైనర్ క్యారియర్ నుంచి అనధికారంగా టోల్ వసూళ్ల కేసులో పోలీసులు ప్రశ్నించనున్నారు. దీంతో కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండు రోజుల పాటు విచారించనున్నారు. పోలీసులు సేకరించిన ఆధారాలు చూపించి కాకాణీని ప్రశ్నించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి