Breaking News

గురుకులంలో విద్యార్థులకు నాసిరకం భోజనం


Published on: 01 Jul 2025 17:07  IST

చెన్నూర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని బీఆర్ఎస్వి నాయకులు ఎండీ నాయబ్ ఆరోపించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలను మంగళవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి